Foreign trip: విదేశీ పర్యటనకు చిన్నారి.. 'అభి తుమనిషా'
Sakshi Education
![Abhi Tumanisha](/sites/default/files/images/2023/09/08/abhi-thumanisha-1694173715.jpg)
కర్ణాటక: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉపన్యాస పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సంపాదించి మలేషియా పర్యటనకెళ్లడం సంతోషకరమని హోసూరు కార్పొరేషన్ విద్యాకమిటీ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. హోసూరు పారిశ్రామికవాడ జూజువాడి ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాలలో అభి తుమనిషా గత ఏడాది ప్లస్టూ చదువుతూ రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకొంది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళితో కలిసి మలేషియా పర్యటనకు తీసుకెళ్లారు.
Published date : 08 Sep 2023 05:18PM