JNTU Placements: ప్లేస్మెంట్లో ఉద్యోగాలను సాధించిన జేఎన్టీయూ విద్యార్థులు..
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ విద్యార్థులు 9 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు లభించాయి. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల కాంపస్లో ‘సైంట్ లిమిటెడ్’ నిర్వహించిన ప్లేస్మెంట్ ప్రక్రియలో తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు.
Study for Students: విద్యార్థులకు సచివాలయ సేవల అధ్యయనం
వార్షిక కనీస వేతనం రూ.4.5 లక్షలతో ఎంపికైన వారికి ఉద్యోగావకాశాలు దక్కాయని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య, రిజస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.గురునాథ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సి.నీలిమాదేవి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ టీఎస్ఎన్ మూర్తి అభినందనలు తెలిపారు.