Erranna Vidya Sankalpam : ముగిసిన ఎర్రన్న విద్యా సంకల్పం పరీక్ష..
Sakshi Education
![End of Erranna Vidya Sankalpam exam](/sites/default/files/images/2024/07/22/erranna-vidya-sankalpam-1721646868.jpg)
శ్రీకాకుళం: ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో వరుసగా రెండో ఏడాది నిర్వహించిన ఎర్రన్న విద్యా సంకల్పం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు, మెటీరియల్స్ను తన తండ్రి ఎర్రన్నాయుడు జ్ఞాపకార్థం అందజేయాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాది ఆదివారం జిల్లాలో శ్రీకాకుళంలోని విద్యాధరి డిగ్రీ కళాశాల, పలాసలోని మదర్ థెరిస్సా పాఠశాల, టెక్కలి విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల ఈ మూడు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 650 మంది హాజరయ్యారు.
Students and Teachers Bond : అధ్యాపకులపై విద్యార్థుల భావోద్వేగం.. వెళ్లొద్దంటూ కన్నీళ్లు!
Published date : 22 Jul 2024 04:44PM