Skip to main content

Students and Teachers Bond : అధ్యాప‌కుల‌పై విద్యార్థుల భావోద్వేగం.. వెళ్లొద్దంటూ క‌న్నీళ్లు!

Students stops teachers from leaving their school due to transfer

ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్‌దాస్‌పేట ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, మంజుల, అంజలి బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు భావోద్వేకానికి గురయ్యారు. సారు, మేడం మీరు వెళ్లొద్దు.. అంటూ కన్నీరు పెట్టుకోవడంతో అక్కడున్న వారిని కలచివేసింది.

Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్‌.. సీటు వస్తే ఏడేళ్ల పాటు ఉచితంగా విద్యాబోధన

తల్లిదండ్రుల తర్వాత బడులలో విద్యార్థులను సరైన క్రమంలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆప్యాయంగా పాఠాలు చెబుతూ ఆటలు ఆడిస్తూ గడిపిన రోజు లను గుర్తుచేసుకుంటూ విద్యార్థులు మీరు వెళ్లొద్దు సార్‌.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు, దీంతో ఉపాధ్యాయులు కూడా బోరున విలపించారు.

Published date : 23 Jul 2024 10:04AM

Photo Stories