SCERT: డెప్యుటేషన్ విధానంలో బోధన చేసేందుకు దరఖాస్తులు.. వీరే అర్హులు..

ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి)లో డిప్యూటేషన్, ఓడీ విధానంలో పని చేసేందుకు అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Teachers: టాచర్లు సెలవులు లేకుండా పని చేయాలి..!
సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ, ఎంఈడీ పూర్తి చేసి, బోధనలో పదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. వయస్సు 58 సంవత్సరాలకు మించి ఉండరాదన్నారు. మనస్తత్వ శాస్త్రం 1, తత్వ శాస్త్రం 1, సామాజిక శాస్త్రం 1, గణితం 3, భౌతిక శాస్త్రం 3, జువాలజీ 3, సోషల్ 3, తెలుగు 3, ఇంగ్లీష్ 3, ఉర్దూ 2, హిందీ 1, ఐసీటీ 3, శారీరక విద్యలో ఒకటి చొప్పున ఖాళీ పోస్టులు ఉన్నట్లు తెలిపారు.
Practical Exams: ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..
అర్హత, అసక్తి కలిగిన వారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం (నేడు)నుంచి ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.