Skip to main content

Telangana Jobs: 459 మంది వీఆర్‌ఏలకు పోస్టింగ్‌

Posting for 459 VRAs

మెదక్‌: క్రమబద్ధీకరణలో భాగంగా వీఆర్‌ఏలను వివిధ శాఖలకు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో 82 మంది, యూడీ డిపార్ట్‌మెంట్‌ వార్డు ఆఫీసర్‌లుగా 32 మంది, రెవెన్యూ రికార్డు అసిస్టెట్‌లు 46 మంది, రెవెన్యూ సబార్డినెంట్‌, చైన్‌మెన్‌, సూపర్‌నుమోరీలుగా 10 మంది, ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌లో 22 హెల్పర్లుగా, లాస్కర్లుగా 141, మిషన్‌భగీరథలో హెల్పర్లుగా 126 మంది చొప్పున కేటాయించారు. వీరికి పేస్కేల్‌ రూ.24,280 నుంచి రూ.72,850 వరకు ఉంటుంది. కాగా జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా వీఆర్‌ఏలు ఉన్నారు. ఉండగా ఈ విషయంపై కలెక్టరేట్‌ ఏవో యూనుస్‌ మాట్లాడుతూ ఇది మొదటి విడత మాత్రమేనని, మిగతావారికి సైతం త్వరలోనే పోస్టులు కేటాయిస్తామన్నారు.

Telangana New Government Jobs 2023 : శుభ‌వార్త‌.. 14,954 కొత్త పోస్టులు మంజూరు.. శాఖల వారిగా ఖాళీల వివ‌రాలు ఇవే..

Published date : 05 Aug 2023 03:47PM

Photo Stories