ఏపీ ట్రిపుల్ ఐటీలకు 40,171 దరఖాస్తులు
Sakshi Education
నూజివీడు(ఆగిరిపల్లి): ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు మొత్తం 40,171 దరఖాస్తులు వచ్చినట్లు అడ్మిషన్స కన్వీనర్ గోపాలరాజు జూలై 1న ఒక ప్రకటనలో తెలిపారు.
18,738 మంది బాలురు, 21,433 మంది బాలికలు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. జూన్ 13న ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు. జూలై 1వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది.
Published date : 02 Jul 2019 02:45PM