నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో భాగంగా ఎనిమిదో రోజైన డిసెంబర్ 1న 281 మందికి అడ్మిషన్లు కల్పించినట్లు కన్వీనర్ గోపాలరాజు తెలిపారు.
అడ్మిషన్లు కేటాయింపు
ఇప్పటి వరకు కౌన్సెలింగ్ ద్వారా నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఓపెన్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు చెందిన అన్ని సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఎస్సీ రీజియన్ పరిధిలోని ఎస్సీ కేటగిరీ సీట్లు 14, ఎస్టీ కేటగిరీకి సంబంధించి అన్ని ట్రిపుల్ ఐటీల్లో కలిపి 170 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.