తిరుపతి సిటీ: ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీలలో ఎంఏ, ఎమ్కాం, ఎమ్మెస్సీతో పాటు పలు పీజీ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది.
PG Spot Admissions
పీజీ సెట్–2024 అర్హత సాధించని విద్యార్థులు, సెట్కు పరీక్షలు రాయని విద్యార్థులు సైతం ప్రవేశం పొందేందుకు వెసులుబాటు కల్పించింది. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. త్వరలో వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.