ఇంటర్ ఫస్టియర్ (ఒకేషనల్) విద్యార్థులకు డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డ్ నవంబర్ 30న ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాక్టికల్స్ తెదీల వివరాలు
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాళ్లందర్నీ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ చేశారు. అయితే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఒకేషనల్ సహా ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫలితాలు వెల్లడించే సమయంలో ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్ «థర్డ్వేవ్ వల్ల రెండో ఏడాది పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు వస్తే మొదటి ఏడాది మార్కులను కొలమానంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.