పాఠశాలలకు సెలవు అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోసిపుచ్చారు.
పాఠశాలల మూత ప్రచారం అసత్యం
ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశిం చిన విషయాన్ని ప్రస్తావించారు. మాసు్కలు ధరించి, భౌతికదూరం పాటించి కరోనాకు దూరంగా ఉండాలని సూచిం చారు. అసత్య ప్రచారాలను తల్లిదండ్రులు నమ్మొద్దని సబిత సూచించారు.