Skip to main content

పదోన్నతులకు 2 నుంచి డిపార్టుమెంటల్‌ పరీక్ష

కర్నూలు(సెంట్రల్‌): ఉద్యోగుల పదోన్నతుల కోసం 2 నుంచి 7వ తేదీ వరకు డిపార్టుమెంటల్‌ టెస్టు నిర్వహించనున్నారు.
departmental examination
పదోన్నతులకు 2 నుంచి డిపార్టుమెంటల్‌ పరీక్ష

ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఏపీపీఎస్‌సీ ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు నేతృత్వంలో డీఆర్వో కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమన్వయ సమావేశం జరుగనున్నది. కాగా, జిల్లాలో డిపార్టుమెంట్‌ పరీక్షల కోసం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ, అయాన్‌ డిజిటల్‌ సంస్థలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. జిల్లాలో అబ్జెక్టివ్‌ టైప్‌లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షకు 3,399 మంది, ఆఫ్‌లైన్‌లో నిర్వహించే వ్యాసరూప పరీక్షలకు 82 మంది హాజరు కానున్నారు.

Published date : 01 Aug 2023 05:25PM

Photo Stories