Skip to main content

TS EAMCET 2023: టాపర్స్‌గా అబ్బాయిలు... టోటల్‌గా అమ్మాయిలు!.. ఫలితాల తీరు ఇదీ..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి ఎక్కువ మంది అమ్మాయిలే అర్హత సాధించారు. ఇదే సమయంలో టాప్‌ ర్యాంకుల్లో అబ్బాయిల హవా కొనసాగింది.
TS EAMCET 2023
టాపర్స్‌గా అబ్బాయిలు... టోటల్‌గా అమ్మాయిలు!.. ఫలితాల తీరు ఇదీ..

మొత్తంగా ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ లో 80 శాతం.. అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌లో 86 శాతం మంది అర్హత సాధించారు. ఇక ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకన్నా.. ఏపీకి చెందినవారికే ఎక్కు వగా వచ్చాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి, జేఎన్‌టీయూహెచ్‌ నేతృత్వంలో మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 25న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వి.వెంకటరమణ, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌లు పాల్గొన్నారు. 

TS EAMCET Results - 2023 - Engineering Agri./Medical

భారీగా దరఖాస్తులు 

రాష్ట్ర ఎంసెట్‌కు ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. నర్సింగ్‌ సీట్ల భర్తీ కూడా ఎంసెట్‌ ర్యాంకు ద్వారానే చేపట్టడంతో డిమాండ్‌ వచ్చింది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు మొత్తం 2,05,351 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,95,275 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,56,879 (80.33 శాతం) మంది అర్హత సాధించారు. అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌కు 1,15,332 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,06,514 మంది పరీక్ష రాశారు. ఇందులో 91,935 మంది (86.31 శాతం) అర్హత సాధించారు. అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌లో 155.008732 మార్కులతో బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్‌.. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో సంగపల్లి అనిరుధ్‌ 158.899780 మార్కులతో టాపర్లుగా నిలిచారు. 

College Predictor - 2023 - TS EAMCET AP EAPCET

మూడు మార్కులు కలిపి.. 

ఈసారి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మూడు మార్కులు అదనంగా కలిపారు. మొత్తంగా 6 సెషన్లుగా పరీక్షలను నిర్వహించగా.. 5వ, 6వ సెషన్లలో గణితంలో ఇచ్చిన పలు ప్రశ్నలకు సమాధానాలు సరితూకగపోవడం, స్పష్టత లోపించడంతో ఈ మార్కులు కలిపారు. నార్మలైజేషన్‌ ప్రక్రియ ద్వారా కూడా పలు సెషన్లలో కఠినంగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలిపినట్టు తెలిసింది.  

సకాలంలో సమర్థవంతంగా నిర్వహించాం: సబితా ఇంద్రారెడ్డి 

ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహించామని, దీనిపై సంబంధిత విభాగాలకు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు తెలుపుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించినవారిని మంత్రి అభినందించారు. రెండు, మూడు రోజుల్లోనే ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు. 

ఎంసెట్‌ ఫలితాల తీరు ఇదీ.. 

 

ఇంజనీరింగ్‌

అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌

అబ్బాయిలు

అమ్మాయిలు

అబ్బాయిలు

అమ్మాయిలు

దరఖాస్తులు

1,24,679

80,672

34,127

81,205

హాజరైనవారు

1,18,739

76,536

31,633

74,881

క్వాలిఫై అయింది

94,065

62,814

26,772

65,163

అర్హత శాతం

79.21

82.07

84.63

87.02

సామాజిక వర్గాల వారీగా క్వాలిఫై అయినవారు (ఇంజనీరింగ్‌లో)

కేటగిరీ

తెలంగాణ వారు

ఏపీవారు

మొత్తం (శాతం)

బీసీ–ఏ

7,470

3,547

11,017 (72.99)

బీసీ–బీ

23,711

5,132

28,843 (75.53)

బీసీ–సీ

552

208

760 (75.39)

బీసీ–డీ

20,706

7,088

27,794 (74.30)

బీసీ–ఈ

5,824

1,480

7,304 (71.06)

ఓసీ

32,268

18,119

50,387 (80.57)

ఎస్సీ

16,370

3,262

19,632 (100)

ఎస్టీ

10,426

716

11,142 (100)

మొత్తం

1,17,327

39,552

1,56,879 (80.33)

సామాజికవర్గాల వారీగా క్వాలిఫై అయినవారు (అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌లో)

కేటగిరీ

తెలంగాణవారు

ఏపీవారు

మొత్తం (శాతం)

బీసీ–ఏ

4,313

1,870

6,183 (76.39)

బీసీ–బీ

11,171

2,197

13,368 (78.77)

బీసీ–సీ

486

207

693 (84.20)

బీసీ–డీ

11,648

2,749

14,397 (75.08)

బీసీ–ఈ

8,232

908

9,140 (81.13)

ఓసీ

9,531

4,224

13,755 (87.11) 

ఎస్సీ

18,976

3,577

22,553 (100) 

ఎస్టీ

11,070

776

11,846 (100)

మొత్తం

75,427

16,508

91,935 (86.31)

Published date : 26 May 2023 03:19PM

Photo Stories