Skip to main content

Badminton: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్‌?

Sindhu at WTF

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేసియాలోని బాలి నగరంలో డిసెంబర్‌ 5న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఏడో ర్యాంకర్‌ సింధు 16–21, 12–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఆన్‌ సెయంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో అత్యధికంగా మూడుసార్లు ఫైనల్‌ చేరిన క్రీడాకారిణి అయిన సింధు ఫైనల్లో ఆశించినస్థాయిలో ఆడలేకపోయింది.

విజయాన్ని ఖాయం చేసుకొని సీజన్‌ ముగింపు టోర్నీ టైటిల్‌ సాధించిన తొలి దక్షిణ కొరియా క్రీడాకారిణిగా ఆన్‌ సెయంగ్‌ గుర్తింపు పొందింది. గత రెండు వారాల్లో బాలిలోనే జరిగిన ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లలో కూడా ఆన్‌ సెయంగ్‌ విజేతగా నిలిచింది. సింధు తదుపరిగా 2021, డిసెంబర్‌ 12న స్పెయిన్‌లో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
చ‌ద‌వండి: ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌-2021 విజేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్‌?
ఎప్పుడు : డిసెంబర్‌ 5
ఎవరు : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు
ఎక్కడ : బాలి, ఇండోనేసియా
ఎందుకు : మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఏడో ర్యాంకర్‌ సింధు 16–21, 12–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఆన్‌ సెయంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైనందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Dec 2021 06:17PM

Photo Stories