Asian Games Equestrian: ఈక్వెస్ట్రియన్లో భారత్కు కాంస్య పతకం
Sakshi Education
ఈక్వెస్ట్రియన్ (అశ్వ క్రీడలు)లో భారత్కు మరో పతకం దక్కింది.
Anush Agarwalla wins bronze in equestrian
డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్వల్లా కాంస్య పతకం సాధించాడు. 14 మంది పోటీపడిన ఫైనల్లో అనూష్, అతని అశ్వం 73.030 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి.
మరోవైపు వుషు క్రీడాంశంలో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత క్రీడాకారిణి రోషిబినా దేవికి నిరాశ ఎదురైంది. వుజియోవె (చైనా)తో జరిగిన 60 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో రోషిబినా దేవి 0–2తో ఓడిపోయి రజత పతకం కైవసం చేసుకుంది.