Skip to main content

E-Schools: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ‘ఈ–పాఠశాల’.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలు

ఇప్పటికే బైజూస్‌ ద్వారా స్మార్ట్‌ ఫో­నుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్‌ అంది­స్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవే­శపెడుతోంది.

ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీ­ఈ­ఆర్‌టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్‌ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్‌ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. 

Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ల‌క్ష్య‌మిదే..
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..
లాంగ్వేజెస్, నాన్‌ లాంగ్వేజెస్‌.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్‌సీఈఆర్‌టీ నిమగ్నమైంది. ప్ర­స్తుతం 4వ తరగతి నుంచి నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు బైజూస్‌ సంస్థ ద్వారా కంటెంట్‌ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నా­యంగా ఎస్‌సీఈఆర్‌టీ అదే తరహాలో ఈ–కం­టెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్‌­సీ­ఈఆర్‌టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్‌ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఈ– కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. 
దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్‌­ఫారం, ఐఎఫ్‌బీ ప్లాట్‌ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్‌ చానెల్‌)లో అందుబా­­టులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రక­మైన కంటెంట్‌ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తు­తం ఎవ­రికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్‌ను రూ­పొందించి యూ­ట్యూ­బ్‌లో పెడుతున్నారు. దీనివల్ల విద్యా­ర్థులు కొంత సంశయానికి లోనవు­తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ­మే అన్ని అధికారిక చానళ్లలో ఎన్‌సీఈ­ఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన ఈ–కంటెంట్‌ను అందుబాటులో ఉంచనుంది.

R-5 zone: అమరావతిలో ఆర్‌-5 జోన్‌.. అసలు ఆర్​-5 జోన్లు​ అంటే ఏమిటి?

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగానే పాఠ్యాంశాలు
ఏపీలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవే­శపెడుతున్నందున ఎన్‌సీఈఆర్‌టీ సిల­బస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పా­ఠ్యాంశాలు ఉండేలా ఎస్‌సీఈఆర్‌టీ చ­ర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రా­నికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెను­క­బడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్‌సీ­ఈఆర్‌టీ సిలబస్‌ ఆధారంగానే జరు­గు­తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా­ర్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఈ–కంటెంట్‌ రూపకల్ప­నలో యథాతథంగా అనుసరిస్తు­న్నా­రు. జాతీయ కరిక్యులమ్‌ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేట­ప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరా­గా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు. 

Jagananna Gorumudda: జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం

Published date : 08 Apr 2023 12:12PM

Photo Stories