Skip to main content

NITI Aayog: నీతి ఆయోగ్‌ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?

NITI Aayog new CEO Parameswaran Iyer

Telugu Current Affairs - Persons: నీతి ఆయోగ్‌ సీఈవోగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం జూన్‌ 24న అధికారికంగా ప్రకటించింది. పరమేశ్వరన్‌ అయ్యర్‌ రెండేళ్ల పాటు నీతి ఆయోగం సీఈవోగా కొనసాగనున్నారు. 2022, జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్న అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

Queen of the United Kingdom: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2

1981 ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన పరమేశ్వరన్‌ అయ్యర్‌ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితిలో సీనియర్‌ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు. ఆ తర్వాత 2016లో భారత్‌కు తిరిగి వచ్చారు. వెంటనే డ్రింకింగ్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగానికి అధిపతిగా కేంద్రం నియమించింది. అంతకు ముందు 2014లో కేంద్రం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు నాయకత్వం వహించారు.

GK Sports Quiz: తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించిన దేశం?IIT Madras: ఐఐటీఎం ఆచార్యునికి ప్రతిష్టాత్మక పురస్కారం

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నీతి ఆయోగ్‌ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు : జూన్‌ 24
ఎవరు    : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : నీతి ఆమోగ్‌ ప్రస్తుత సీఈవో జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో..

GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

Published date : 25 Jun 2022 03:19PM

Photo Stories