Skip to main content

Sainthood: ఇటీవల సెయింట్‌హుడ్‌ పొందిన భారత పౌరుడు?

Devasahayam Pillai, Sainthood

మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్‌ సిటీలో మే 15న జరిగిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్‌ మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్‌ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు.

GK Important Dates Quiz: ప్రపంచ NGO దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?

ట్రావెన్‌కోర్‌లో జననం.. కన్యాకుమారిలో కాల్చివేత..
1712 ఏప్రిల్‌ 23న కేరళలోని ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో హిందూ నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు.  ట్రావెంకోర్‌ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు.

దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్‌ బిషప్స్‌ సమాఖ్య పోప్‌ ఫ్రాన్సిస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్‌ గుర్తించినట్టు వెల్లడించారు.
Andhra Pradesh: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా)
ఎప్పుడు : మే 15
ఎవరు    : పోప్‌ ఫ్రాన్సిస్‌
ఎక్కడ    : వాటికన్‌ సిటీ
ఎందుకు : దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 May 2022 05:56PM

Photo Stories