Skip to main content

Vande Bharat Train: 20 కోచ్‌ల వందేభారత్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్‌ రైలు పేరొందింది.
Railways trials 20 Coach Vande Bharat Train Reached Mumbai from Ahmedabad

ఇప్పుడు మరో వందేభారత్‌ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.

కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్‌ రైలు పరుగులు తీయనుంది. ఆగ‌స్టు 9వ తేదీ అహ్మదాబాద్-ముంబై మధ్య గంటకు 130 కిలోమీట‌ర్ల‌ వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. 

ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. 

భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

High Speed Rail: చెన్నై–మైసూర్‌ మధ్య తొలి హైస్పీడ్‌ రైలు.. వయా చిత్తూరు మీదుగా..

Published date : 10 Aug 2024 06:31PM

Photo Stories