Skip to main content

India’s First Constitution Park: భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ ఉద్యానవనం ప్రారంభం.. ఎక్క‌డంటే..!

భారత సైన్యం, పునీత్ బాలన్ గ్రూప్ కలిసి పూనేలో భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ ఉద్యానవనాన్ని ప్రారంభించ‌డానికి చేతులు కలిపాయి.
India’s First constitution park inaugurated in Pune

ఈ వేడుకకు లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ నేతృత్వం వహించారు. 2047 నాటికి భారతాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాజ్యాంగంలో పేర్కొన్న విధులను పౌరులు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా చెప్పారు.

పునీత్ బాలన్ గ్రూప్ అధ్యక్షుడు పునీత్ బాలన్ ఈ చొరవలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక హక్కులు, విధులను తాము పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశపు పునాదిని గౌరవించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తామని ఆయన ధృవీకరించారు.

Nakshatra Sabha: ఉత్తరాఖండ్‌లో నక్షత్ర సభ.. ఈ సభలో ఏముందంటే..

ఈ ఉద్యానవనం భారత రాజ్యాంగాన్ని స్మరించుకునేలా రూపొందించబడింది. రాజ్యాంగంలోని ముఖ్య అంశాలను వివరించే విద్యా స్తంభాలు, స్వాతంత్య్ర‌ సమరయోధుల విగ్రహాలు, పిల్లలకు ఆట స్థలాలు ఇక్కడ ఉన్నాయి. దేశభక్తిని పెంపొందించడానికి, రాజ్యాంగం పట్ల అవగాహన పెంచడానికి ఈ ఉద్యానవనం ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Published date : 07 May 2024 10:33AM

Photo Stories