Skip to main content

Russia-Ukraine War: జీ7, నాటో చర్చలకు ఆథిత్యం ఇస్తోన్న నగరం?

Russia-Ukraine War

రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభ నేపథ్యంలో కీలక సమావేశాలకు బెల్జియం రాజధాని నగరం బ్రస్సెల్స్‌ వేదికైంది. మార్చి 24వ తేదీ నుంచి నగరంలో నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో), గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7), యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మరింత భద్రత కల్పించాలని నాటో చీఫ్‌ స్లోల్టెన్‌బర్గ్‌ అగ్రదేశాధినేతలకు సూచించారు. ఈ మూడు సదస్సుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొంటున్నారు. మరోవైపు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం: కొన్ని అంశాలు.. 

  • రష్యా పార్లమెంట్‌ సభ్యులు, రష్యన్‌ బంగారు నిల్వలపై అమెరికా ఆంక్షలు విధించింది.
  • రష్యాకు చెందిన ఒక యుద్ధ నౌకను ముంచేశామని ఉక్రెయిన్‌ ప్రకటించగా, ఇజియం నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. దేశంలో చాలా చోట్ల రష్యాదళాలకు ఉక్రెయిన్‌ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది.
  • ఉక్రెయిన్‌ అధ్యక్షడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి మేరకు మరింత సాయం అందిస్తామని పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌కు మరో 50 కోట్ల యూరోల సాయం అందిస్తామని యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది.

Girls Education: బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు?

భద్రతామండలిలో రష్యాకు చుక్కెదురు
ఉక్రెయిన్‌లో మానవీయ సహకారంపై రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతామండలిలో తిరస్కారం పొందింది. తీర్మానం ఆమోదం పొందేందుకు 15 సభ్యదేశాల్లో 9 దేశాల అంగీకారం అవసరం కాగా చైనా తీర్మానానికి మద్దతు పలికింది. రష్యా, చైనా మినహా ఇతర 13 సభ్యదేశాలు తీర్మానానికి దూరంగా ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్‌పై దాడికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో రష్యా వైఫల్యం బయటపడినట్లయింది. ఉక్రెయిన్‌లో సంక్షోభానికి రష్యా ఆక్రమణే కారణమని ఉక్రెయిన్‌ రూపొందించిన తీర్మానానికి సాధారణ అసెంబ్లీలో భారీ మద్దతు లభించింది. ఉక్రెయిన్‌ తీర్మానానికి భారత్‌ దూరంగా ఉంది.

కలకలానికి నెల!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమై నెల రోజులైంది. ఇప్పటివరకు ఈ సంక్షోభ కారణంగా వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడమే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌లో నియో నాజీ జాతీయవాదులు పెరిగారని, వీరిని అదుపు చేయడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ మిలటరీ, మౌలిక సదుపాయాలపై మిస్సైల్‌ దాడులకు ఆదేశించారు.

  • యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24, 2022
  • ఉక్రెయిన్‌ను వీడిన శరణార్థులు: 35 లక్షలు 
  • నిరాశ్రయులైనవారు: కోటిమంది. 
  • ఉక్రెయిన్‌ ఆర్థిక నష్టం: సుమారు రూ. 8 లక్షల కోట్లు 
  • ఉక్రెయిన్‌ వైపు మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం) 
  • రష్యా వైపు మరణాలు: 15,800 మంది సైనికులు (ఉక్రెయిన్‌ రక్షణశాఖ గణాంకాలు).

Canada PM Justin Trudeau: కెనడా దేశ కరెన్సీ పేరు ఏమిటీ?

మార్స్‌ మిషన్‌ నిలిపివేత
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్‌ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ప్రకటించింది. 2022 ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్‌ మిషన్‌ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్‌ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్‌ ఏజెన్సీ తెలిపింది.

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Mar 2022 07:00PM

Photo Stories