Skip to main content

Economic Crisis: ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం?

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు(ఇంధన రేషనింగ్‌) విధించారు. తాజా రేషన్‌ విధానం ఏప్రిల్‌ 15న నుంచి అమల్లోకి వచ్చిందని శ్రీలంక ప్రభుత్వం అధీనంలోని సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ తెలిపింది. దీని ప్రకారం టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్‌ పోస్తారు. వాణిజ్య వాహనాలను రేషన్‌ నుంచి మినహాయించారు. విద్యుత్‌ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి.

Russia-Ukraine War: సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత యుద్ద నౌక?

వంటగ్యాస్‌ కోసం భారత్‌కు అభ్యర్థన..
తీవ్ర వంటగ్యాస్‌ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది. రుణ రూపేణా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు ప్రభుత్వ రంగ లిట్రో గ్యాస్‌ కంపెనీ తెలిపింది. శ్రీలంక రూపాయి విలువ పతనం కావడంతో అత్యవసరాలకు సైతం తీవ్ర కొరత ఏర్పడింది.

United Nations: ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం?
ఎప్పుడు  : ఏప్రిల్‌ 15
ఎవరు    : శ్రీలంక
ఎక్కడ     : శ్రీలంక వ్యాప్తంగా..
ఎందుకు : దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నందున..

Published date : 16 Apr 2022 04:19PM

Photo Stories