Skip to main content

AndhraPradesh: మార్చి 31లోగా పెండింగ్‌ బిల్లుల చెల్లింపు.. ఏపీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగ­మని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరి­ష్క­రిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖ­రు­కల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Sajjala Ramakrishna Reddy

వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర­నాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌­ఆర్‌) చిరంజీవి చౌదురి సుదీర్ఘంగా చర్చించారు.

చ‌ద‌వండి: రాష్ట్రంలో ప్రతి సెకన్‌కు ఒక మొబైల్‌ తయారీ​​​​​​​
ఉద్యోగులంతా కుటుంబ స‌భ్యులే...

అనం­తరం సజ్జల, ఆదిమూలపు సురేష్‌ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సజ్జల మాట్లాడుతూ.. ఉద్యో­గుల సంక్షేమంపై ఎప్పుటికప్పుడు చర్చిస్తు­న్నా­మని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, అందరూ కలిసికట్టుగా పనిచేయడంవల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయని చెప్పారు.
ఉద్యోగుల‌కు అనుకూలం...
కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం జగన్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు. 

చ‌ద‌వండి: 20 రంగాల్లో 6 లక్షల ఉద్యోగా­లు..
బిల్లులు పెండింగ్‌లో లేకుండా చేస్తాం

మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్‌ బిల్లులను మార్చి 31లోపు క్లియర్‌ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తామన్నారు. రిటైర్మెంట్‌కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్‌ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు.
గ‌తంలో ఉన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం...
టీఏ, ఏపీజీఎల్‌ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించామని, దీర్ఘకాలికంగా ఉండి గత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాని అంశాలపైనా స్పష్టత ఇచ్చామని, పరిష్కార మార్గం కనుగొన్నామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం తరచూ సమావేశమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. 

చ‌ద‌వండి:​​​​​​​ మొద‌టిరోజే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు​​​​​​​
మార్చి 31లోగా పెండింగ్‌ బిల్లుల చెల్లింపు

ఉద్యోగులకు ఈ నెల 31లోగా రూ.3 వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మహిళా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 5 స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వడానికి సుముఖత వ్యక్తంచేశారు. 2004కు ముందు ఎగ్జామ్స్‌ పాస్‌ అయిన వాళ్లకు సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారడానికి అనుమతించడానికి సానుకూలంగా స్పందించారు. వీఆర్‌ఏలకు డీఏ పునరుద్ధరణ, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి ఉత్తర్వులు ఇవ్వడానికీ ఒప్పుకున్నారు.

Published date : 08 Mar 2023 05:27PM

Photo Stories