Skip to main content

CAA New Portal: సీఏఏకు కొత్త పోర్టల్ ప్రారంభం.. ద‌రఖాస్తు చేసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు మార్చి 12న కీలక ఆదేశాలు జారీ చేసింది.
"Central government announcement on Citizenship Amendment Act implementation   New Portal for Applying for Citizenship Under CAA Launched   Notification granting citizenship to non-Muslim refugees from Pakistan, Afghanistan, and Bangladesh

ఈ చట్టం ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తు చేసుకోండిలా..
➢ ఈ చట్టం కింద దరఖాస్తుల స్వీకరణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కొత్త వెబ్ పోర్టల్ https://indiancitizenshiponline.nic.inను ప్రారంభించింది.
➢ అలాగే.. CAA-2019 పేరుతో ఒక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Citizenship Amendment Act : వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం.. అమల్లోకి సీఏఏ!!

అర్హులు వీరే..
➢ 2014 డిసెంబర్ 31కి ముందు హింసకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర వ్యక్తులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు.
➢ హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు.
➢ వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది.
పాత చట్టంలో మార్పులు..
➢ భారతదేశంలో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఉన్న నిబంధనను మోదీ సర్కార్ సవరించింది.
➢ ఇప్పుడు, గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదా ఏడాది కాలంగా భారతదేశంలో నివసించిన వారికి ఈ చట్టం వర్తిస్తుంది.

Vande Bharat Trains: 10 ‘వందే భారత్‌’ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అవి తిరిగేది ఎక్క‌డంటే..?

Published date : 14 Mar 2024 10:52AM

Photo Stories