Skip to main content

Vande Bharat Trains: 10 ‘వందే భారత్‌’ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అవి తిరిగేది ఎక్క‌డంటే..?

దేశంలోని ‍ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
PM Narendra Modi Flags Off 10 New Vande Bharat Trains  Prime Minister Narendra Modi inaugurating Vande Bharat trains

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలనూ స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇస్తోందన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. 

10 రైళ్లు ఇవే.. 
1. అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్
2. సికింద్రాబాద్ - విశాఖపట్నం
3. మైసూరు - డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై)
4. పాట్నా - లక్నో
5. న్యూ జల్పాయిగురి - పాట్నా
6. పూరీ - విశాఖపట్నం
7. లక్నో – డెహ్రాడూన్
8. కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
9. రాంచీ - వారణాసి
10. ఖజురహో - ఢిల్లీ (నిజాముద్దీన్)

మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్, కోరాపుట్-రాయగఢ్‌ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు. మొత్తం 85 వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు.

Underwater Metro: నీటి అడుగున నడ‌వ‌నున్న‌ మెట్రో రైలు.. దీని విశేషాలు ఇవే..

సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో రైలు..
సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా రైలును ప్రారంభించగా.. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం రోజు ఈ రైలు నడవదు.
వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. ఒక రైలు సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య, మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.

Bharat Mandapam: ప్రగతి మైదానం ఇకపై ‘భారత్‌ మండపం’

Published date : 12 Mar 2024 03:27PM

Photo Stories