Skip to main content

Unified Payments Interface: భారత వెలుపల యూపీఐని అమలు చేయనున్న తొలి దేశం?

UPI

భారత్‌ రూపొందించిన ఏకీకృత చెల్లింపుల విధానం(యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌–యూపీఐ) నేపాల్‌లో అమల్లోకి రానుంది. ఇది ఆ దేశ డిజిటల్‌ ఎకానమీని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగలదని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫిబ్రవరి 17న ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత వెలుపల యూపీఐని అమలు చేసే తొలి దేశం నేపాల్‌ అవుతుందని పేర్కొంది. నేపాల్‌ సర్వీసులు అందించేందుకు ఎన్‌పీసీఐ అంతర్జాతీయ విభాగం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ (ఎన్‌ఐపీఎల్‌), గేట్‌వే పేమెంట్స్‌ సర్వీస్‌ (జీపీఎస్‌), మనం ఇన్ఫోటెక్‌ చేతులు కలిపినట్లు వివరించింది. యూపీఐను ఎన్‌పీసీఐ రూపొందించింది. ఎన్‌పీసీఐ ప్రధాన కార్యాలయం భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఉంది.

చ‌ద‌వండి: ఏ దేశానికి చెందిన 54 యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత వెలుపల ఏకీకృత చెల్లింపుల విధానం(యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌–యూపీఐ)ను అమలు చేయనున్న తొలి దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు    : నేపాల్‌
ఎక్కడ : నేపాల్‌
ఎందుకు  : డిజిటల్‌ ఎకానమీని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగలదని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Feb 2022 01:52PM

Photo Stories