Skip to main content

Free Trade Agreement: పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన దేశాలు?

India-Britain Flags

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ (సీబీఐ), కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కలిసి ఈ జాయింట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్‌ లార్డ్‌ కరణ్‌ బిలిమోరియా తెలిపారు. ఎఫ్‌టీఏ సాకారమైతే  2035 నాటికి బ్రిటన్‌–భారత్‌ మధ్య వాణిజ్యం 28 బిలియన్‌ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్‌ పౌండ్ల స్థాయిలో ఉంది.

GK National Quiz: 2021-22లో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
India-Nordic Summit 2022: రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సును ఎక్కడ నిర్వహించారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన దేశాలు?
ఎప్పుడు : మే 09
ఎవరు    : భారత్, బ్రిటన్‌
ఎందుకు

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

: పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో..

 

Published date : 10 May 2022 07:10PM

Photo Stories