Iconic Brand of India Award: శ్రీసిటీకి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా–2023 అవార్డు
![Sricity's Iconic Contribution to India, Iconic Brand of India Award,Sricity Recognized as Iconic BrandPrestigious Award for Sricity](/sites/default/files/images/2023/09/28/sri-city-1695878157.jpg)
ఈ నెల 25వ తేదీ సాయంత్రం ముంబైలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ కాన్క్లేవ్ ఆరవ ఎడిషన్లో 2023 సంవత్సరానికి గాను ‘ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా’ అవార్డును శ్రీసిటీకి అందజేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మైల్స్వామి అన్నాదురై, శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్కు ట్రోఫీ అందజేశారు.
Dr. Madina Prasada Rao: విశాఖ పశు వైద్యుడికి ఉత్తమ విస్తరణ అధికారి జాతీయ అవార్డు
అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన విశిష్ట భారతీయ బ్రాండ్గా హోదా దక్కించుకున్నందుకు న్యాయనిర్ణేతల ప్యానెల్ శ్రీసిటీని అవార్డుకు ఎంపిక చేసింది. జీవన ప్రమాణాలు పెంచడం, సామాజిక, ఆర్థిక వృద్ధికి దోహదపడటం, పర్యావరణాన్ని పరిరక్షించడం తదితర అంశాల్లో శ్రీసిటీ పాత్రను ప్యానెల్ పరిగ ణనలోకి తీసుకుంది.
Norman Borlaug Award: స్వాతి నాయక్కు ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ అవార్డు