Skip to main content

DRDL Scientist: సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు-2020కు ఎంపికైన శాస్త్రవేత్త?

Dr. Jaiteerth Raghavendra Joshi

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీ(DRDL) డైరెక్టర్‌ డాక్టర్‌ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డును జోషీకి అందిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ప్రకటించింది. ఇంజనీర్స్‌ డే(సెప్టెంబర్‌ 15) సందర్భంగా 2021, సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును డాక్టర్‌ జోషీకి అందించారు.

30 ఏళ్లుగా రక్షణరంగ శాస్త్రవేత్తగా...

వరంగల్‌లోని ఎన్‌ఐటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన డాక్టర్‌ జోషీ దాదాపు 30 ఏళ్లుగా రక్షణరంగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. దేశ రక్షణలో కీలకమైన  పృథ్వీ, అగ్ని క్షిపణి వ్యవస్థలతోపాటు ఎల్‌ఆర్‌సామ్‌ అభివృద్ధిలో, ఇతర వైమానిక వ్యవస్థల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న జోషీ నేషనల్‌ టెక్నాలజీ అవార్డుతోపాటు పలు ఇతర అవార్డులు పొందారు.

చ‌ద‌వండి: భారత్‌ తరఫున బెస్ట్‌ విలేజ్‌ పోటీలో నిలిచిన గ్రామం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డాక్టర్‌ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు–2020 ప్రదానం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 15, 2021
ఎవరు    : ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు  : శాస్త్ర, సాంకేతిక రంగంలో చేసిన సేవలకుగాను...

 

Published date : 16 Sep 2021 06:36PM

Photo Stories