Gurukula Staff Issues: గురుకుల సిబ్బంది సమస్యలపై వినతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశా రు.
![Demand for Solutions for Contract and Outsourcing Employees Petition on Gurukula staff issues Gurukula Outsourcing Employee Issues](/sites/default/files/images/2024/06/15/ts-gurukulam-jobs0-16787935560-1718426831.jpg)
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేత నాలు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వేతన చెల్లింపుల్లో ఇత రుల ప్రమేయం లేకుండా.. నేరుగా ప్రిన్సిపల్ నుంచి ఆన్లైన్ పద్ధతిలో జరపాలని సూచించారు.
చదవండి: Promotions: ఎస్సీ గురుకులాల్లో పదోన్నతులపై ‘Service Rules’ రద్దుచేయాలి
మధ్యవర్తుల ద్వారా చెల్లింపుల వల్ల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభంలోపు ప్రభు త్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Published date : 31 May 2024 12:37PM