Sports Competitions: వసంత ట్రిపుల్ జంప్ లో విద్యార్థులకు రజత పతకం
Sakshi Education
విద్యార్థుల జిల్లా స్థాయి పోటీల్లో సాధించిన ప్రతిభను గురించి ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని విజయం పొందిన వారికి ఈ పురస్కారాన్ని అందించారు.
College principal awarding students
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్ జలగం అనిత శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఉమెన్స్ లీగ్ అథ్లెంటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో కళాశాలకు చెందిన విద్యార్థినులు వసంత ట్రిపుల్ జంప్ విభాగంలో రజత పతకాన్ని సాధించినట్లు తెలిపారు.
అదేవిధంగా డిస్క్త్రోలో జ్యోతి, శ్రీజ, లాంగ్ జంప్లో అంజలి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లెక్చరర్లు కోటయ్య, గణపతి, ప్రభాత్రావు, చంద్రకాంత్, నరేష్ పాల్గొన్నారు.