Best Teachers Awards: AU ఆచార్యులకు రాష్ట్ర స్థాయి అవార్డులు
Sakshi Education
ఏయూక్యాంపస్: ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఆచార్యుల పురస్కారానికి ఏయూ నుంచి ఈ సంవత్సరం ఆరుగురు ఆచార్యులు ఎంపికయ్యారు.
State level awards for AU professors
ఆర్ట్స్, కామర్స్ కళాశాల నుంచి అకడమిక్ డీన్గా సేవలందిస్తున్న కామర్స్ మేనేజ్మెంట్ విభాగం ఆచార్య ఎన్.కిశోర్బాబు, సైన్స్ కళాశాల పరిధిలో రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి.శ్యామల, మీటియరాలజీ విభాగ ఆచార్యులు సి.వి.నాయుడు, న్యాయ కళాశాల నుంచి ఆచార్య కె.సీతామాణిక్యం, ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఎలక్ట్రికల్ ఇంజీనరింగ్ ఆచార్యులు కె.రమాసుధ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు, ఐక్యూఏసి డైరెక్టర్ ఆచార్య డి.లలితభాస్కరి ఉత్తమ ఆచార్యులుగా ఎంపికయ్యారు.