Skip to main content

ట్రిపుల్‌ఐటీలో ముగిసిన ఓరియంటేషన్‌

Orientation concluded at TripleIT
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన ఓరియంటేషన్‌

భైంసా(ముధోల్‌): 2023–24 విద్యాసంవత్సరంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన నూతన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్‌ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఆరేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు, ట్రిపుల్‌ఐటీ విద్యావిధానం, నేర్చుకునే అంశాలు, వివిధ కోర్సుల గురించి విద్యార్థులకు వివరించారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. విద్యార్థులు జానపదాలపై వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ట్రిపుల్‌ఐటీ బాసర సెరల్‌ అండ్‌ సోషల్‌ యాక్టివిటీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

Published date : 07 Aug 2023 03:53PM

Photo Stories