Skip to main content

MBBS And BDS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో.. యాజమాన్య కోటాకు నోటిఫికేషన్‌

MBBS And BDS Admissions NTR viswa vidhyalaya notification NRI quota seats medical education admissions MBBS BDS seats

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల యాజమాన్య కోటా.. గత ఏడాది ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఎంబీబీఎస్‌.. స్వీమ్స్‌లో ఎంబీబీఎస్‌ సీట్ల ఎన్‌ఆర్‌ఐ కోటాలో ప్రవేశాల కోసం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. నీట్‌ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 

Reliance Foundation Scholarships: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ఇందుకు ఈనెల 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు గడువు విధించారు. అలాగే, శుక్రవారం (16వ తేదీ) సా.7 గంటల నుంచి ఆదివారం (18వ తేదీ) రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ అందుబాటులో ఉండదని.. ఈ సమయంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని వర్సిటీ వెల్లడించింది. ఈ వ్యవధిలో కన్వీనర్‌ కోటాలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ సర్వర్లు మెయింటెనెన్స్‌లో ఉండడంవల్ల ఈ అంతరాయం ఉంటుందని సమాచారం. 

Top 10 Medical Colleges In India : నేటి నుంచే కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్-10 మెడికల్‌ కాలేజీలు ఇవే..

యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు సమయంలో విద్యార్థులు రూ.10,620ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.30,620ల ఆలస్య రుసుముతో 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 23వ తేదీ సా.6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో నియమ నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168.. సాంకేతిక సమస్యలపై 9000780707 నెంబర్లను సంప్రదించాల్సిందిగా రిజి్రస్టార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు.   


 

Published date : 15 Aug 2024 01:39PM

Photo Stories