Skip to main content

Inauguration Ceremony: ఎకో ఫ్రెండ్ల్రీ వాహ‌నంతో పాటు ఏయూలో హాస్ట‌ల్ల ప్రారంభోత్సవం

ఏఐటీఏఎమ్ విద్యార్థులు రూపొందించిన వాహ‌నాన్ని, ఏయూలో హాస్ట‌ల్ల‌ను ప్రారంభించారు వైఎస్సార్సీపీ కో-ఆర్డినేట‌ర్. ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..
A close-up of the vehicle designed by AITAM students,YSRCP regional coordinator Subba Reddy and other officers,AU hostels at the inauguration event with the YSRCP coordinator.
YSRCP regional coordinator Subba Reddy and other officers

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాడు– నేడు పనుల్లో భాగంగా ఆధునీకరించిన శ్రీకృష్ణదేవరాయ వసతి గృహం (ఎస్‌కేడీ హాస్టల్‌)ను వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. నాడు– నేడు పనుల్లో భాగంగా ఈ హాస్టల్‌లో 240 గదులను ఆధునీకరించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. మంచినీటి సౌకర్యం, విద్యుత్‌, టాయిట్‌ సౌకర్యాలను ఆధునికంగా తీర్చిదిద్దారు.

AP Students Visits white house: వైట్‌ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ

ఈ కార్యక్రమం అనంతరం సుబ్బారెడ్డి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐతం) విద్యార్థులు రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ వాహనాన్ని ప్రారంభించారు. ఐతం విద్యార్థులు రూపొందించిన ఈ ఇంధన రహిత వాహనాన్ని ఆ కళాశాల యాజమాన్యం ఏయూకు అందజేసింది. వివిధ అవసరాల నిమిత్తం వర్సిటీని సందర్శించే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. పర్యావరణ హితమైన ఇలాంటి వాహనాలను మరిన్ని అందుబాటులోకి తేవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

Published date : 29 Sep 2023 01:23PM

Photo Stories