IAS officer Chakrapani: విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
Sakshi Education
మణుగూరురూరల్: విద్యార్థులు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి తెలిపారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న చక్రపాణి
మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి హాజరై మాట్లాడారు. సామాజిక మాధ్యమాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.