State Level Competitions: యోగాసన పోటీల్లో ప్రథమ స్థానం పొందిన యువతికి అభినందనలు
![Student achieved first position in state level yoga competitions](/sites/default/files/images/2023/09/12/yoga-competitions-1694511912.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: కర్నూలులో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలలో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన ఉద్యాన కళాశాల వెంకట్రామన్నగూడెం విద్యార్థిని ఎ.సుధారాణి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. మహిళల 18–21 సంవత్సరాల కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని సాధించారు. విద్యార్థినిని సోమవారం వర్సిటీ ఉపకులపతి టి.జానకీరామ్ అభినందించారు.
Success Story: ఈ జంట సాధించిన విజయంతో వారి ఇంట వేడుకలు రెట్టింపు...
వీసీ మాట్లాడుతూ యోగాభ్యాసనం వల్ల శరీరం, మనసు అదుపులో ఉండటమే కాక, వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చన్నారు. ఈ మేరకు వర్సిటీలో యోగాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో బహుమతి గెల్చుకున్న సుధారాణి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. డీన్ ఆఫ్ హార్టీకల్చర్ ఎస్.పద్మావతమ్మ, ఎస్టేట్ ఆఫీసర్ ఎంవీ మల్లికార్జునరావు, అసోసియేట్ డీన్ ఎం.మాధవి, అధ్యాపకురాలు, పీడీ వై.రాంబాబు పాల్గొన్నారు.