సాక్షి, హైదరాబాద్: పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 27వ తేదీన ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు.
విద్యార్థులతో ప్రధాని మాటామంతీ
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మోదీని ఏవైనా ప్రశ్నలు అడిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రశ్నలు అడగాలనుకున్న విద్యార్థులు తమ సందేహాలను హెచ్డీ క్వాలిటీతో కూడిన వీడియో రూపంలో జనవరి 15వ తేదీలోగా pibhyderabad@gmail.comకు పంపాలని పీఐబీ జనవరి 12న ఒక ప్రకటనలో సూచించింది.