Tenth Public Exams : టెన్త్ పబ్లిక్ పరీక్షలకు భయపడి.. లక్ష మంది విద్యార్థులు బడికి దూరంగా.. ఎక్కడంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : పబ్లిక్ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రాకుండా నిలిచిపోయారు.
tenth class public exams fear news in telugu
ప్రసుత్త విద్యా సంవత్సరంలో లక్షమందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేసినట్లు వెల్లడైంది. తమిళనాడు వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకివచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను పబ్లిక పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని, ఆ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తేల్చింది.