Skip to main content

AISF: విద్యారంగ సమస్యలపై పోరాటం

కరీంనగర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఏఐఎస్‌ఎఫ్‌ నిరంతర పోరాటాలు చేపట్టాలని సంఘం మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు పిలు పునిచ్చారు.
AISF
విద్యారంగ సమస్యలపై పోరాటం

రెండ్రోజుల పాటు జరగనున్న ఏఐఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ఆగ‌స్టు 3న‌ జిల్లాకేంద్రంలోని తారకహోటల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందించలేదని పేర్కొన్నారు.

చదవండి: New Exam Pattern: విద్యా ప్రమాణాలు పెరుగుతాయి

ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో తేవడాన్ని వ్యతిరేకించాలని, దీనిపై విద్యార్థి సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘ ం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ ఇటిక్యాల రామకృష్ణ, రెహమాన్‌, రఘురాం, గ్యార నరేశ్‌, గ్యార క్రాంతి, రాజు, బాలసాని లెనిన్‌, సోతుకు ప్రవీణ్‌, నెల్లి సత్య, మచ్చ రమేశ్‌, మడ్డుపల్లి లక్ష్మణ్‌, జనార్ధన్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

చదవండి: Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

Published date : 04 Aug 2023 01:42PM

Photo Stories