బాన్సువాడ రూరల్: బోర్లం క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో అక్టోబర్ 13న జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది.
గురుకులాల జోనల్ క్రీడలు ప్రారంభం
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఓఎస్డీ భానుప్రసాద్, డీసీవో కృతామూర్తి, ప్రిన్సిపల్ పద్మకుమారిలతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థు లు చక్కటి ప్రదర్శనతో సత్తా చాటాలన్నారు.
భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు ఎదగా లని ఆకాంక్షించారు. మూడో జోన్ పరిధిలోని కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన సుమారు 1275 మంది విద్యార్థినులు హాజరవుతున్నారని డీసీవో కృతామూర్తి తెలిపారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు.