అశ్వారావుపేట రూరల్: కొండరెడ్డి తెగకు చెందిన నిరుపేద విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కింది.
ఆదివాసి విద్యార్థికి అరుదైన అవకాశం..
హైదరాబాద్ రాజ్భవన్లో డిసెంబర్ 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్న కార్యక్రమంలో అనువాదకురాలిగా కొండరెడ్డి విద్యార్థిని చిప్పల రేణుక ఎంపికైంది. ఈ మేరకు రేణుకతో పాటు తల్లిదండ్రులకు కూడా రాజ్భవన్ నుంచి డిసెంబర్ 28న ప్రత్యేకంగా పిలుపు అందింది.
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని మొద్దులమాడ గ్రామానికి చెందిన చిప్పల బాబురెడ్డి కుమార్తె రేణుక హైదరాబాద్ ఐటీడీఏ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.