ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ తీసుకున్న నిర్ణయాలపై ఆ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) నాయకులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్కు ఫిర్యాదు చేశారు.
గవర్నర్కు వినతిపత్రం సమర్పిస్తున్న ఔటా నాయకులు
ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్ సంఘం నాయకులతో కలసి నవంబర్ 16న రాజ్భవన్లో గవర్నర్ వినతిపత్రం సమర్పించారు. ఓయూ వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అకడమిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వారు వివరించారు.