సైన్స్ డిగ్రీ కళాశాలకు పీజీ ర్యాంకుల పంట
Sakshi Education
ఆదిలాబాద్టౌన్: పీజీ ప్రవేశపరీక్ష ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెరుగైన ర్యాంకులు సాధించారు.
ఆగస్టు 22న విడుదలైన ఈ ఫలితాల్లో ముండే రుమా తాయి ఎంఏ హిస్టరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, పొలిటికల్ సైన్స్లో 59వ, ఇంగ్లిష్లో 179వ ర్యాంకులతో సత్తా చాటారు. అలాగే ఖడ్సే విష్ణుప్రియ హిందీలో 10వ ర్యాంకు, గణితంలో 29, కందుకూరి సాహితి భౌతికశాస్త్రంలో 62, కంప్యూటర్ సైన్స్లో 205, సిరిపురే శ్రద్ధ రసాయన శాస్త్రంలో 262, గాజుల ప్రత్యూష గణితంలో 308, పిట్ల అపర్ణ గణితంలో 788, ఇరవైన ప్రియాంక గణితంలో 1298వ ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ జగ్రామ్ అంతర్వేది, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Published date : 23 Aug 2023 01:29PM