టేకులపల్లి: మండలంలోని కొప్పురాయి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మొత్తం 47 మంది బాలబాలికలు చదువుతున్నారు.
ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు
వీరికి బాలాజీ అనే ఉపాధ్యాయుడు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నాడు. అన్ని తరగతులకు అన్ని సబ్జెక్ట్ల పాఠాలు ఆయనే చెప్పాల్సి రావడం, విద్యార్థుల నోటు పుస్తకాల పరిశీలన, వివిధ రకాల రిపోర్టులు పంపించే పనులతో సతమతమవుతున్నాడు.
ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ పాఠశాలకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.