Skip to main content

Andhra Pradesh: మెడికల్‌ కళాశాలపనుల పరిశీలన

మాకవరపాలెం: మండలంలోని భీమబోయినపాలెం వద్ద రూ.500 కోట్లతో ప్రభుత్వం చేపట్టినమెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను డిసెంబ‌ర్ 17న‌ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ పరిశీలించి, ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడారు.
new medical college   MLA Petla Umashankar Ganesh inspecting Bhimaboyanapalem Medical College construction

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కళాశాల నిర్మాణం పూర్తయితే వేలాది మందికి మెరుగైన వైద్యసేవలు అందు తాయని చెప్పారు. డిసెంబ‌ర్ 30న నర్సీపట్నంలో జరగనున్న సామాజిక సాధికార బస్సుయాత్రకు హాజరయ్యే మంత్రులు, ఇతర ముఖ్యనేతలు ఈ కళాశాల పనులను పరిశీలించనున్నట్టు చెప్పారు.

చదవండి: AP New MBBS Seats in 2024 : ఏపీలో కొత్త‌గా మ‌రో 850 ఎంబీబీఎస్‌ సీట్లు.. ఈ కాలేజీల్లో కూడా..

ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లాకార్యదర్శి గోవిందరావు, భద్రాచలం, తూర్పుకాపు సంఘ మండల అధ్యక్షుడు హరిబాబు, యూత్‌ అధ్యక్షుడు శ్రీను, యూత్‌ జిల్లా కార్యదర్శి నాయుడు పాల్గొన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 19 Dec 2023 10:26AM

Photo Stories