KNRUHS: ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాల విడుదల
Sakshi Education
MBBS ఫైనలియర్ పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఆగస్టు 10న ప్రకటించింది.
మొత్తం 2,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై.మల్లేశ్వర్ ఆగస్టు 10న ఒక ప్రకటనలో తెలిపారు. 2022 మే నెలలో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం (పార్ట్–2) పరీక్షల్లో మొత్తం 92.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. వీరిలో 34 మంది డిస్టింక్షన్లో ఉత్తీర్ణులు కాగా 1034 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారని పేర్కొన్నారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని సూచించారు.
చదవండి:
Published date : 11 Aug 2022 01:53PM