Skip to main content

CSIR: కొండాపూర్‌లో బాలికల ఐటీఐకి అనుమతి

సీఎస్‌ఆర్‌లో భాగంగా
ITI in Kondapur
ITI in Kondapur
  • – రూ.7 కోట్లు ఇచ్చిన హెచ్‌ఏఎల్‌

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని కొండాపూర్‌లో బాలికల పారి శ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఏర్పాటుకు ప్రభు త్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఏర్పాట్లను వెంటనే ప్రారంభిం చాలని కార్మిక ఉపాధి కల్పన శాఖకు సూచిం చింది. ఈ క్రమంలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సంస్థ తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ. 7 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు గురువారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో హెచ్‌ఏఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ జనార్ధన్‌ సరకటే, కార్మిక శిక్షణ ఉపాధి కల్పన శాఖ సంచాలకుడు కేవై నాయక్‌ ఒప్పందం కుదు ర్చుకున్నారు. ఈ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఎల క్ట్రానిక్‌ మెకానిజం, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ (కోపా), ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ అండ్‌ డిజైన్‌ తదితర కోర్సుల్లో 232 మంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు.
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌  ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 19 Nov 2021 03:29PM

Photo Stories