ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కడైతే ఎంబీబీఎస్ వైద్య విద్య అభ్యసిస్తారో..అక్కడే ఇంటర్న్షిప్ కూడా చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎం సీ) స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్ చదివిన చోటే ఇంటర్న్షిప్
నవంబర్ 2021 తర్వాత ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇది వర్తి స్తుందని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెం డేళ్లలోపు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలని, అని వార్య పరిస్థితుల్లో పొడిగించుకోవచ్చని సూచి ంచింది. విదేశీ వైద్య విద్యార్థులకు మాత్రం వెసులుబాటు కల్పించింది. అయితే వారికి తొలి ప్రాధాన్యంగా కొత్త వైద్యకళాశాలల్లో కేటా యింపులు జరపాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్ఎంసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.