ఈ పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులు ఉండగా రెండు రోజులుగా దాదాపు 60 మంది వరకు కళ్ల కలక బారిన పడ్డారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ అనితను సంప్రదించగా కళ్ల కలక వచ్చిన విద్యార్థులకు నర్సు ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కళ్ల కలక తగ్గని విద్యార్థులను వారి ఇళ్లకు పంపుతున్నామని పేర్కొన్నారు.